Brahmamgari Matam: కడప జిల్లాలో ఘోరం: కరెంట్ షాక్‌తో రైతు మృతి!

Brahmamgari Matam: బ్రహ్మంగారిమఠం మండలం మద్దిరెడ్డిపల్లెలో విద్యుత్ షాక్ ప్రమాదం. హైటెన్షన్ తీగలకు మోటారు పైపు తగిలి రైతు రమణయ్య అక్కడికక్కడే మృతి.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 13 July 2026 9:46 AM IST
Brahmamgari Matam
X

Brahmamgari Matam: కడప జిల్లాలో ఘోరం: కరెంట్ షాక్‌తో రైతు మృతి!

Brahmamgari Matam: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటారు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్ తగిలి ఓ రైతు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికులు మరియు పోలీసుల సమాచారం మేరకు.. మండల పరిధిలోని మద్దిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన రైతు రమణయ్య తన పొలంలో వ్యవసాయ మోటారు పాడవడంతో మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో మోటారు పైపులను పైకి తీస్తుండగా, అవి ప్రమాదవశాత్తూ పైనే ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ తీవ్రంగా ప్రవహించి రైతు రమణయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఆయనతో పాటు ఉన్న నాగేశ్వర్ రెడ్డి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, గాయపడిన నాగేశ్వర్ రెడ్డిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న బ్రహ్మంగారిమఠం పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. రమణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. రమణయ్య మృతితో మద్దిరెడ్డిపల్లె గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story