Markapur: మార్కాపురంలో దొంగల సంచారం.. సీసీ కెమెరాలు ధ్వంసం

Markapur: మార్కాపురంలో దొంగలు ఇంట్లోకి చొరబడే ప్రయత్నంలో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. స్థానికులు పోలీసు గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 29 April 2026 9:57 AM IST
Markapur
X

Markapur

Markapur: మార్కాపురం పట్టణంలో దొంగల సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. దర్శి రామకృష్ణ ఆసుపత్రి సమీపంలోని ఓ ఇంట్లోకి దొంగలు చొరబడేందుకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు దొంగల కదలికలను గుర్తించడంతో, వారు వెంటనే కెమెరాలను ధ్వంసం చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే కెమెరాల్లో కొంత మేరకు దృశ్యాలు రికార్డు కావడంతో దొంగల సంచారం బయటపడింది.

ఈ ఘటనతో ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రాత్రివేళల్లో భద్రత లేకపోవడంతో భయభ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అలాగే పట్టణంలో రాత్రివేళల్లో పోలీసు గస్తీ పెంచి భద్రతను మరింత బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు వరుసగా చోటుచేసుకోవడంతో ప్రజల్లో భయం పెరుగుతోంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story