Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ ఆత్మహత్య ముగ్గురిపై కేసు నమోదు!

Asifabad: ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో మహిళ ప్రాణహిత నదిలో దూకి ఆత్మహత్య. వేధింపులకు గురిచేసిన ముగ్గురిపై కేసు నమోదు.

SRINIVAS, KOUTALA
Published on: 29 Aug 2026 7:47 PM IST
Asifabad
X

Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో మహిళ ఆత్మహత్య ముగ్గురిపై కేసు నమోదు!

Asifabad: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి చెందిన చప్పిడి సుగుణ అనే మహిళ ప్రాణహిత నదిలో పడి ఆత్మహత్యకు చేరుకున్న ఘటన ధిందా గ్రామంలో చోటు చేసుకుంది.

మృతురాలి కుమార్తె శారద ఫిర్యాదు మేరకు డోకే నారాయణ, అతని భార్య బాయక్క, మరదలు బుజ్జక్కపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కమాలకర్ తెలిపారు. మృతురాలు సుగుణను ముగ్గురు వ్యక్తులు బూతు పదాజలంతో దూషించడంతో మనస్తాపానికి గురైన సుగణ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె కుమార్తె ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు.

SRINIVAS, KOUTALA

SRINIVAS, KOUTALA

Next Story