Polavaram: ముంపు బాధితులకు నాటు పడవపై మినరల్ వాటర్ పంపిణీ!
Polavaram: విఆర్ పురం మండలం శ్రీరామగిరి ముంపు బాధితులకు నాటు పడవలపై మినరల్ వాటర్ పంపిణీ చేసిన ఆర్ డబ్ల్యు ఎస్ జెఈ సాయిరామ్, కార్యదర్శి రవితేజ.
Polavaram: ముంపు బాధితులకు నాటు పడవపై మినరల్ వాటర్ పంపిణీ!
పోలవరం జిల్లా - చింతూరు
ముంపు బాధితులకు మినరల్ వాటర్ పంపిణీ
ఆర్ డబ్ల్యు ఎస్ జెఈ కి ప్రశంసలు
వి ఆర్ పురం : పోలవరంజిల్లా విఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి గ్రామం గోదావరి వరద వలన ముంపుకు గురైంది. ఈ ప్రాంతానికి చెందిన గ్రామస్తులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సుమారు 100 కుటుంబాలు మంచినీటితో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న ఆర్ డబ్ల్యు ఎస్ జెఈ సాయిరామ్, శ్రీరామగిరి పంచాయతీ కార్యదర్శి రవితేజ బాధితుల కోసం నాటు పడవ పై మినరల్ వాటర్ తీసుకుని వెళ్లారు. ముంపు బాధితులకు మినరల్ వాటర్ ను అందించడంతో బాధితులు ఆనంద వ్యక్తం చేశారు. మంచినీటి అందించే విషయంలో సత్వరమే స్పందించి బాధితులకు మంచినీటిని సరఫరా చేయడం పట్ల జెఈ సాయిరామ్ ను పలువురు ప్రశంసించారు
Next Story




