Rampachodavaram: రంపచోడవరం డిగ్రీ కాలేజీలో డీఎస్పీ అష్రఫ్ కీలక సూచనలు
Rampachodavaram: రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు చెడు వ్యసనాలు, సైబర్ మోసాలపై స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.
Rampachodavaram: రంపచోడవరం డిగ్రీ కాలేజీలో డీఎస్పీ అష్రఫ్ కీలక సూచనలు
Rampachodavaram: పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరం ప్రముఖ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్థానిక పోలీసు అధికారులు యువతను చెడు వ్యసనాల బారిన పడకుండా మరియు సైబర్ మోసాలకు గురి కాకుండా ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సదస్సులో డీఎస్పీ అష్రఫ్ ఆలీ గారు మరియు రంపచోడవరం సీఐ నరేంద్ర ప్రసాద్, ndps ఆంజనేయులు, రంపచోడవరం si రమేష్, si నరసింహ మూర్తి, పోలీసు సిబ్బంది ముఖ్య అతిథులుగా పాల్గొని,విద్యార్థులకు మాదకద్రవ్యాల (Drugs), మద్యపానం, ధూమపానం మరియు సైబర్ మోసాలు వంటి అలవాట్ల వల్ల కలిగే తీవ్ర నష్టాలను వివరించారు.
చెడు వ్యసనాల దుష్ప్రభావాలు:
పోలీసు అధికారులు విద్యార్థులతో మాట్లాడుతూ,నేటి యువత చిన్న వయస్సులోనే ఆకర్షణలకు లోనై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.డ్రగ్స్, గుట్కా,మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసలవడం వల్ల శారీరక,మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాక,వారి కుటుంబాలు కూడా తీవ్ర మానసిక క్షోభను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు.చట్టపరమైన పరిణామాలు మరియు సైబర్ నేరాలు.
ఈ కార్యక్రమంలో మాదకద్రవ్యాల నిరోధక చట్టం (NDPS Act) కింద ఉన్న కఠినమైన శిక్షల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు.డ్రగ్స్ సేవించడం, రవాణా చేయడం లేదా తోటి విద్యార్థులకు సరఫరా చేయడం వంటి నేరాలకు పాల్పడితే జీవితాలు జైలుపాలయ్యే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.అలాగే, సైబర్ నేరాలు మరియు సోషల్ మీడియా వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా పోలీసులు పలు సూచనలు చేశారు.
యువతకు పిలుపు: విద్యార్థులు తమ విలువైన సమయాన్ని చదువు, క్రీడలు, మరియు సృజనాత్మక కార్యక్రమాలపై కేటాయించాలని అధికారులు సూచించారు. ఎవరైనా స్నేహితులు లేదా తోటి విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడినట్లు గమనిస్తే, భయపడకుండా కళాశాల యాజమాన్యానికి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చివరగా, విద్యార్థులందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం, మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.




