Kukkunuru: డోర్ టూ డోర్ ప్రచారం వేగవంతం చేయాలి.. అమరవరపు అశోక్!
Kukkunuru: వేలేరుపాడు టీడీపీ కార్యాలయంలో సమావేశం. కూటమి ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఇంటికీ వివరించాలని కోరిన మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్.
Kukkunuru: డోర్ టూ డోర్ ప్రచారం వేగవంతం చేయాలి.. అమరవరపు అశోక్!
Kukkunuru: మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ సమావేశంలో మండల అధ్యక్షుడు అమరవరపు అశోక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఇంటికి వెళ్ళి వివరించాలని డోర్ టూ డోర్ ప్రచారం కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని అదేవిధంగా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుందని ప్రతి వార్డు, ప్రతి పంచాయతీ గెలవాలని నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయం చేసుకుని ప్రతి గ్రామంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ వివరించాలని బూత్ , యూనిట్, క్లస్టర్ ఇంచార్జీలకు దిశా నిర్దేశం చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కట్టం రాంబాబు, ఐటీడీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు శావిలి సుభాష్ చంద్రబోస్, కరుటూరీ క్రిష్ణ , కుక్కునూరు రాంబాబు, సోడే నాగేంద్ర బాబు, నల్లసిరి త్రిమూర్తులు ,చాపర్ల శ్రీను, ఎండి నఖీమ్ , కుంజా విజయ్ ,గోపి, పెంటారావు, కురిమెళ్ళ కృష్ణ ,భేతి శ్రీను,భిరం అంజి ,సలీం , కుక్కునూరు సత్తిబాబు, పద్దం రమేష్ ,సవలం రాధా, కట్టి లక్ష్మణరావు, బంధం రాంబాబు, బెతి కిరణ్, సవలం సూరిబాబు, పొట్ల వీరబాబు సోడే సుధాకర్, సోడే రవి, పాయం వినోద్, జార్తి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.




