Bapatla: మార్టూరులో భూ సర్వేల జాప్యంపై రైతుల ఆవేదన

Bapatla: బాపట్ల జిల్లా మార్టూరు మండలంలో భూ సర్వే తేదీలను అధికారులు వాయిదా వేస్తుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైనం.

KaleshaVali (Bhasha), Chirala
Published on: 23 July 2026 9:45 PM IST
Bapatla
X

Bapatla: మార్టూరులో భూ సర్వేల జాప్యంపై రైతుల ఆవేదన

బాపట్ల: బాపట్ల జిల్లా మార్టూరు మండలంలోని పలువురు రైతులు తమ భూముల సర్వే కోసం రెవెన్యూ శాఖకు దరఖాస్తులు సమర్పించారు. అయితే అధికారులు సర్వే తేదీలను పదేపదే వాయిదా వేస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

సర్వే ఫీజులు పూర్తిగా చెల్లించినప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించడం లేదని వారు చెబుతున్నారు. కొంతమందికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి, మిగిలిన వారి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

దీంతో భూముల కొనుగోలు, విక్రయాలు, బ్యాంకు రుణాలు, ఇతర వ్యవసాయ పనులు ఆలస్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని, రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్న అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని, ఉన్నత రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.

KaleshaVali (Bhasha), Chirala

KaleshaVali (Bhasha), Chirala

Next Story