Cherukupalli: వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
Cherukupalli: చెరుకుపల్లిలో వినాయక మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. డీజేల వినియోగంపై నిషేధం ఉందని స్పష్టం చేసిన ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు.
Cherukupalli: వినాయక మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
చెరుకుపల్లి: వినాయక చవితి వేడుకల సందర్భంగా చెరుకుపల్లి మండలంలోని వినాయక చవితి మండపాల నిర్వాహకులు నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని చెరుకుపల్లి ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు స్పష్టం చేశారు. వేడుకలు ప్రశాంత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆయన నిర్వాహకులకు సూచించారు.
మండపాల ఏర్పాటుకు పోలీసు, విద్యుత్, అగ్నిమాపక (ఫైర్) మరియు స్థానిక పంచాయతీ విభాగాల నుంచి ముందస్తుగా అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.మండపాల వద్ద ప్రమాదాలు జరగకుండా అర్హత కలిగిన ఎలక్ట్రీషియన్ల ద్వారానే విద్యుత్ వైరింగ్ చేయించాలన్నారు.
పోలీసు నిబంధనల ప్రకారం వేడుకల్లో మరియు నిమజ్జన ఊరేగింపుల్లో డిజే (DJ) సౌండ్ సిస్టమ్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు.సాధారణ స్పీకర్లను పరిమిత పరిమాణంలో (డెసిబెల్స్) మాత్రమే వినియోగించాలన్నారు.
ప్రతీ మండపం వద్ద రాత్రి వేళల్లో కూడా నిర్వాహకులు లేదా వాలంటీర్లు అందుబాటులో ఉండాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రజలు, నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని ఎస్ఐ కందుల కృష్ణ తిరుపతిరావు విజ్ఞప్తి చేశారు.




