Vinukonda: విద్యా రంగంలో 'విజన్ 2047' లక్ష్యం.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: వినుకొండలో పదో తరగతి టాపర్లను ఘనంగా సన్మానించిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు.

KAREEMULLA, VINUKONDA
Published on: 4 May 2026 2:33 PM IST
Vinukonda
X

Vinukonda: విద్యా రంగంలో 'విజన్ 2047' లక్ష్యం.. చీఫ్ విప్ జీవీ

Vinukonda: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు:చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. వినుకొండలో టెన్త్ క్లాస్ టాపర్లకు ఘనంగా సన్మానం చేసిన జీవీ ఆంజనేయులు. పల్నాడు జిల్లాలోనే 89.7 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచిన వినుకొండ. గత వైసీపీ ప్రభుత్వ 117 జీవో విద్యా వ్యవస్థకు శాపంగా మారింది. టీచర్లను బ్రాందీ షాపుల వద్ద కాపలా పెట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది.

నాడు-నేడు పేరుతో గత ప్రభుత్వం విద్యా సంస్థలను దోపిడీ కేంద్రాలుగా మార్చింది. మంత్రి నారా లోకేష్ అంకితభావంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు. విజన్ 2047 లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. ప్రభుత్వ పాఠశాలల పనితీరు 78.39 శాతానికి మెరుగుపడటం శుభపరిణామం. బాలికలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించడం మహిళా సాధికారతకు నిదర్శనం.

LEAP యాప్, మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌తో సాంకేతిక విప్లవం. తల్లికి వందనం, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాలతో తగ్గిన డ్రాపౌట్లు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గర్వంగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి విద్యా ప్రమాణాలు. తల్లిదండ్రులారా.. ప్రభుత్వ బడులను ఆదరించండి, సదుపాయాలను సద్వినియోగం చేసుకోండి జీవీ పిలుపు.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story