Bapatla: ఒత్తిడికి చెక్ పెట్టాలంటే యోగా చేయాల్సిందే.. పర్చూరులో కలెక్టర్ పిలుపు!

Bapatla: బాపట్ల జిల్లా పర్చూరులో ఘనంగా నిర్వహించిన 'యోగాంధ్ర-2026' కార్యక్రమం. అందరితో కలిసి యోగాసనాలు వేసిన కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 13 Jun 2026 12:12 PM IST
Bapatla
X

Bapatla: ఒత్తిడికి చెక్ పెట్టాలంటే యోగా చేయాల్సిందే.. పర్చూరులో కలెక్టర్ పిలుపు!

బాపట్ల జిల్లా: పర్చూరు పట్టణంలోని అద్దంకి నాంచారమ్మ కళ్యాణ మండపం ప్రాంగణంలో శనివారం ఉదయం నిర్వహించిన యోగాంధ్ర–2026 కార్యక్రమంలో కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొని అందరితో కలిసి ఉత్సాహంగా యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిరోజూ యోగా సాధన చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. నేటి జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా దివ్య ఔషధంలా ఉపయోగపడుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటి కలెక్టర్, లవన్న యోగాంధ్ర నోడల్ అధికారి చంద్రశేఖర్, డీఎంహెచ్వై విజయమ్మ, డీసీహెచ్ఎస్ పద్మావతి, ఆర్డీవో, హరికుమార్, తహసీల్దార్ బ్రహయ్య మరియు జిల్లా అధికారులు మండల స్థాయి సిబ్బంది అపాల్గొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.

Next Story