Chirala: పొలంలో విద్యుత్ వైర్లు తగిలి రైతు శ్రీనివాసరెడ్డి మృతి!
Chirala: బాపట్ల జిల్లా చీరాల మండలం కావూరివారిపాలెంలో విషాదం.
Chirala: పొలంలో విద్యుత్ వైర్లు తగిలి రైతు శ్రీనివాసరెడ్డి మృతి!
బాపట్ల జిల్లా: చీరాల మండలం కావూరివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. వేరుశెనగ పంటకు నీళ్లు పెడుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి శ్రీనివాసరెడ్డి అనే రైతు (55) మృతి చెందారు.
ఇంటి నుంచి పొలం వెళ్లిన రైతు శ్రీనివాసరెడ్డి విగత జీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Next Story




