Pedakakani: పెదకాకాని ఆలయంలో 5 గురు అర్చకులు సస్పెండ్.. ఈవో చర్యలు!

Pedakakani: పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి బంగారు మంగళసూత్రాల అదృశ్యం కేసులో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు అర్చకులను ఈవో లీలాకుమార్ సస్పెండ్ చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 26 Aug 2026 5:24 PM IST
Pedakakani
X

Pedakakani: పెదకాకాని ఆలయంలో 5 గురు అర్చకులు సస్పెండ్.. ఈవో చర్యలు!

పెదకాకాని: పెదకాకాని శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి బంగారు మంగళసూత్రాలు అదృశ్యమైన ఘటనలో బాధ్యతారాహిత్యం, విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఐదుగురు అర్చకులను సస్పెండ్ చేశారు.

ఉప ప్రధాన అర్చకుడు జాలయ్య తో పాటు విజయ్ ప్రతాప్, విశ్వనాథ్, గాయత్రి మణికణ్ణశాస్త్రి, కాంట్రాక్ట్ అర్చకులు గర్నెపూడి గిరికుమార్లపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆలయ ఈవో లీలాకుమార్ తెలిపారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story