Palnadu: పెదకూరపాడులో టీచర్‌పై కొబ్బరి మట్టలతో దాడి!

Palnadu: పల్నాడు జిల్లా పెదకూరపాడులో జెడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడిపై కొందరు యువకులు కొబ్బరి మట్టలతో దాడికి పాల్పడటం కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

B RAJENDRA, GUNTUR TOWN
Published on: 28 Aug 2026 12:29 PM IST
Palnadu
X

Palnadu: పెదకూరపాడులో టీచర్‌పై కొబ్బరి మట్టలతో దాడి!

Palnadu: పెదకూరపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జంపని నరేష్‌బాబు సహచర సిబ్బందితో కలిసి కారులో పాఠశాలకు వెళ్తుండగా సిరిపురం వద్ద మరో కారుతో స్వల్పంగా ఢీకొన్నట్లు సమాచారం.

ఈ విషయమై కారు యజమాని షేక్ సుభాని, అతని స్నేహితులు ఉపాధ్యాయుడి కారును వెంబడించి పాఠశాల సమీపంలో అడ్డుకున్నారు. అనంతరం నరేష్‌బాబును కిందకు లాగి చేతులతో, కొబ్బరి మట్టలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

B RAJENDRA, GUNTUR TOWN

B RAJENDRA, GUNTUR TOWN

Next Story