Vinukonda: వినుకొండలో రూ.55 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన: చీఫ్ విప్ జీవీ
Vinukonda: వినుకొండ పట్టణంలో రూ. 55 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణ పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు.
Vinukonda: వినుకొండలో రూ.55 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన: చీఫ్ విప్ జీవీ
Vinukonda: వినుకొండ పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణంలోని పలు వార్డుల్లో రూ.55 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. పట్టణాభివృద్ధే ధ్యేయంగా ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు . అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో రాజీ లేకుండా, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
23వ వార్డు డబ్బా సెంటర్లో రూ.25 లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రెయిన్ల నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఇందులో రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, రూ.10 లక్షలతో డ్రెయిన్ల నిర్మాణం జరగనుంది. 29వ వార్డు హనుమాన్ నగర్ 12వ లైన్లో రూ.15 లక్షలతో సీసీ డ్రెయిన్లు నిర్మించనున్నారు. అలాగే 1వ వార్డు సిద్ధార్థ నగర్ 1వ లైన్, కాలువ కట్ట ప్రాంతంలో రూ.15 లక్షల అంచనా వ్యయంతో సీసీ డ్రెయిన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జున రావు, స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




