కూటమి ప్రభుత్వ సంక్షేమానికి ఆకర్షితులై ‘సైకిల్’ ఎక్కిన వైసీపీ శ్రేణులు

Vinukonda: వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

KAREEMULLA, VINUKONDA
Published on: 21 Jun 2026 9:27 PM IST
Vinukonda
X

కూటమి ప్రభుత్వ సంక్షేమానికి ఆకర్షితులై ‘సైకిల్’ ఎక్కిన వైసీపీ శ్రేణులు

Vinukonda: వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వయ్యకల్లు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, టీడీపీ యూనిట్ ఇంచార్జ్ వెంకట్రావు ఆధ్వర్యంలో సుమారు 25 ఎస్సీ కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా వినుకొండలోని ప్రభుత్వ చీఫ్ విప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజా సంక్షేమానికి తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే వినుకొండ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల విశ్వాసం కలిగి పలువురు స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

పార్టీలో చేరిన కుటుంబాలు కూడా కూటమి ప్రభుత్వ పనితీరుపై నమ్మకంతో, నియోజకవర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో టీడీపీలో చేరినట్లు వెల్లడించాయి.

KAREEMULLA, VINUKONDA

KAREEMULLA, VINUKONDA

Next Story