Urban Farming Trend in Vizag: విశాఖలో అర్బన్ ఫార్మింగ్ జోరు.. 40 వేల దాటిన మిద్దె తోటల సాగుదారులు!
Urban Farming Trend in Vizag: విశాఖపట్నంలో అర్బన్ ఫార్మింగ్ విప్లవాత్మకంగా మారుతోంది. 40,000 కంటే ఎక్కువ మంది తమ ఇళ్ల డాబాలపై మిద్దె తోటలు పెంచుతుండగా, ప్రభుత్వం రూ. 3000 సబ్సిడీ అందిస్తోంది.
Urban Farming Trend in Vizag: విశాఖలో అర్బన్ ఫార్మింగ్ జోరు.. 40 వేల దాటిన మిద్దె తోటల సాగుదారులు!
Urban Farming Trend in Vizag: నగరాల్లో కాంక్రీట్ నిర్మాణాలు పెరిగిపోయి పచ్చదనం కనుమరుగవుతున్న వేళ, విశాఖపట్నం వాసులు సరికొత్త ‘అర్బన్ ఫార్మింగ్’ (మిద్దె తోటల పెంపకం) విప్లవానికి శ్రీకారం చుట్టారు. రసాయనాలు లేని పవిత్రమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా విశాఖలోని ఇళ్ల డాబాలన్నీ పచ్చని పంట పొలాలుగా మారుతున్నాయి.
కోవిడ్ తదనంతర కాలంలో ఆరోగ్యస్పృహ పెరగడంతో విశాఖనగరంలో మిద్దె తోటలు పెంచే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం విశాఖ నగరంలో దాదాపు 40,000 మందికి పైగా నగరవాసులు తమ ఇళ్ల పైకప్పులపై కూరగాయలు, ఆకుకూరలు, పూల మొక్కలను సాగు చేస్తున్నారు.
విశాఖ మహిళలు ‘నేచర్ గార్డనర్ ప్రకృతి ఒడి’ వంటి వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని విత్తనాల మార్పిడి, ఆర్గానిక్ ఎరువుల వాడకంపై అవగాహన పెంచుకుంటున్నారు. ప్రతి నెలా సమావేశమై దేశీ విత్తనాలను ఒకరికొకరు ఉచితంగా పంచుకోవడమే కాకుండా ‘సీడ్ బ్యాంక్’ కూడా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా గాజువాకలో ప్రత్యేక ఆర్గానిక్ సంతలను ఏర్పాటు చేసి తాము పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు, కొనుగోలు చేసేందుకు వీలు కల్పించారు.
అర్బన్ ఫార్మింగ్ను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ (Horticulture Department) మరియు జివిఎంసి (GVMC) ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ఉద్యాన శాఖ యాప్లో రిజిస్టర్ చేసుకున్న లబ్ధిదారులకు సిల్ఫాలిన్ కవర్లు, విత్తనాలు, కోకో పిట్, పాటింగ్ మిక్స్చర్, బయో ఫెర్టిలైజర్లతో కూడిన రూ. 6,000 విలువైన కిట్ను అందిస్తున్నారు.
ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా రూ. 3,000 సబ్సిడీ జమ అవుతుంది. విశాఖలో ప్లాస్టిక్ రహిత పర్యావరణ పరిరక్షణతో పాటు స్వచ్ఛమైన ఆహారాన్ని అందిస్తున్న ఈ అర్బన్ ఫార్మింగ్ ట్రెండ్ ఇతర నగరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.




