Medchal: మేడ్చల్‌లో రైలు ప్రమాదం యువకుడిని కాపాడిన 108 సిబ్బంది!

Medchal: మేడ్చల్ రైలు ప్రమాదంలో రెండు కాళ్లు, చేయి విరిగిన యువకుడు. హుటాహుటిన చేరుకుని ప్రాణాపాయం తప్పించిన 108 ఈఎంటీ సీతారాం, పైలట్ తిరుపతి.

NAKSHATRAM, MEDCHAL
Published on: 16 Aug 2026 12:01 PM IST
Medchal
X

Medchal: మేడ్చల్‌లో రైలు ప్రమాదం యువకుడిని కాపాడిన 108 సిబ్బంది!

Medchal: కామారెడ్డి నుండి మేడ్చల్ కు ట్రైన్లు వస్తున్న గట్టమి సతీష్ 38 సంవత్సరాలు ప్రమాదవశాత్తు మేడ్చల్ స్టేషన్ దగ్గరలో ట్రైన్ లో నుండి కింద పడ్డాడు రెండు కాళ్లు మరియు ఎడమ చేయి తీవ్రంగా గాయపడ్డాయి స్థానికులు గమనించి 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటి సీతారాం పైలట్ తిరుపతి హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని ఈ ఆర్ సి పి డాక్టర్ శివ గారి సూచనల మేరకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉంది సమయానికి వచ్చి ఆదుకున్న 108 సిబ్బంది ఈఎంటి సీతారాం పైలెట్ తిరుపతి కి సతీష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కాకినాడ జిల్లా సిరిపురం నివాసి ప్రస్తుతం గండి మైసమ్మ లో ఉంటున్నాడు డాక్టర్ రెడ్డి ల్యాబ్ లో పనిచేస్తున్నాడు.

NAKSHATRAM, MEDCHAL

NAKSHATRAM, MEDCHAL

Next Story