Hyderabad: బిట్స్ పిలానీ WILP స్నాతకోత్సవం రికార్డు స్థాయిలో పట్టాల ప్రదానం!
Hyderabad: హైదరాబాద్ బిట్స్ పిలానీ WILP స్నాతకోత్సవం-2026. 15,153 మంది ఉద్యోగ నిపుణులకు పట్టాల ప్రదానం. వర్చువల్ మెటావర్స్ వేదికగా ఫిజిటల్ ఈవెంట్.
Hyderabad: బిట్స్ పిలానీ WILP స్నాతకోత్సవం రికార్డు స్థాయిలో పట్టాల ప్రదానం!
Hyderabad: బిట్స్ పిలానీ WILPలో రికార్డు స్థాయిలో పట్టాలు హైదరాబాద్లో బిట్స్ పిలానీ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (WILP) స్నాతకోత్సవం-2026 ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 30 విభాగాల్లో విద్యను పూర్తి చేసిన రికార్డు స్థాయిలో 15,153 మంది ఉద్యోగ నిపుణులకు డిగ్రీలు ప్రదానం చేశారు. హైదరాబాద్ క్యాంపస్తో పాటు ప్రత్యేక మెటావర్స్ వేదికపై ఫిజిటల్ విధానంలో వేడుకలు నిర్వహించారు.
పట్టాలు అందుకున్న వారిలో 2,000 మందికి పైగా మహిళలు, 167 మంది వైద్యులు, 60 మంది రక్షణ సిబ్బంది, 15 దేశాలకు చెందిన 80 మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా నిరంతర అభ్యాసం, కెరీర్ వృద్ధికి WILP దోహదపడుతోందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి డిక్సన్ టెక్నాలజీస్ వైస్ చైర్మన్, ఎండీ అతుల్ బి. లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.




