Nacharam: కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి!

Nacharam: కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఉప్పల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకుడు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.

HARISH, TARNAKA
Published on: 6 Sept 2026 2:59 PM IST
Nacharam
X

Nacharam: కేసీఆర్, కేటీఆర్‌లపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి!

Nacharam: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఉప్పల్‌ నియోజకవర్గం మల్లాపూర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ

కేసీఆర్‌ రాజీనామా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేయడంపై శ్రవణ్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యాదాద్రి ఆలయాన్ని నిర్మించినందుకా.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినందుకా.. బస్తీ దవాఖానాలు, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాలు అమలు చేసినందుకా కేసీఆర్‌ రాజీనామా చేయాలి?’’ అని ప్రశ్నించారు. వృద్ధాప్య, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు తదితర వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదేనన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల్లో ఇప్పటివరకు ఏం అమలు చేశారో రేవంత్‌రెడ్డి ప్రజలకు వివరించాలని డిమాండ్‌ చేశారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన ఆయన.. ముఖ్యమంత్రి, మంత్రివర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పాలనపై సీఎం చేస్తున్న వ్యాఖ్యలను కూడా శ్రవణ్‌కుమార్‌ తప్పుబట్టారు. కేసీఆర్‌ ఏం చేస్తున్నారో తెలియకుండా విమర్శలు చేయడం తగదన్నారు. కేసీఆర్‌, కేటీఆర్‌పై నోరు అదుపులో పెట్టుకోవాలని రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు.

కేసీఆర్‌, కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు కొనసాగితే ఉప్పల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసన చేపడతాయని తెలిపారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని 16 డివిజన్ల నుంచి బీఆర్‌ఎస్‌ కుటుంబ సభ్యులు తరలివస్తారని శ్రవణ్‌కుమార్‌ హెచ్చరించారు.

HARISH, TARNAKA

HARISH, TARNAKA

Next Story