Kalwakurthy: బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేతలు!
Kalwakurthy: రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మాదాయపల్లిలో అనారోగ్యంతో మృతిచెందిన కటికేల పార్వతలు కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు రూ.4,000 ఆర్థిక సాయం అందజేశారు.
Kalwakurthy: బాధిత కుటుంబానికి అండగా నిలిచిన కాంగ్రెస్ నేతలు!
కల్వకుర్తి: రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం మాదాయ పల్లి గ్రామనికి చెందిన కటికేల పార్వతలు వారం రోజుల కింద అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు తుడుం భాస్కర్ ద్వారా విషయం తెలుసుకున్న తలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాతబ్ది టౌన్ షిప్ అధ్యక్షులు లింగారావుపల్లి సర్పంచ్ కాసు శ్రీనివాస్ రెడ్డి మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ *4000(నాలుగు వేల రూపాయలు) ఆర్థిక సహాయం స్థానిక నాయకుల ద్వారా అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ చిల్కం ఆంజనేయులు, వార్డు సభ్యులు మాదిగట్ల యాదయ్య, భూషమోని చంద్రమౌళి, చిల్కం రవికుమార్. మాదిగట్ల అమరేందర్ మాదిగట్ల బయ్యా గౌరయ్య.రామస్వామి. శీలం శ్రీనయ్య. మాదిగట్ల రాము. కటికేల నర్సింహా. కటికేల రవి. కటికేల ఆంజనేయులు , గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.




