Vikarabad: పెండింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పంచాలి సీపీఎం

Vikarabad: వికారాబాద్‌లో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు పంచాలి. లేనిచో భూపోరాటం చేస్తామని సీపీఎం మహిపాల్ హెచ్చరిక.

MOGULAIAH, VIKARABAD
Published on: 2 July 2026 4:15 PM IST
Vikarabad
X

Vikarabad: పెండింగ్ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను వెంటనే పంచాలి సీపీఎం

వికారాబాద్: నేడు cpm వికారాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లును సందర్శించి మాట్లాడుతూ 10ఎండ్లుగా పెండింగ్ లో ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇళ్ళను పూర్తి చేసి నిరుపేదలకు పంచాలి. ఇందిరమ్మ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అన్నారు.

వికారాబాద్ జిల్లా కేంద్రంలో అనేక ఏండ్లుగా నివశిస్తున్న నిరుపేదలకు ఇండ్లు ఇండ్ల స్థలాలు లేవు నిజమైన పేదలకు గుర్తించి తక్షణం ఇండ్లు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. గతంలో ఇచిన సర్టిఫికెట్ ఉన్నవారికి సర్వే నంబర్ 244,190, 290, లలో ఇండ్ల పట్టాలు ఇవ్వాలి.

లేనిచో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదాలను సమీకరించి మేమే ఇళ్ల స్థలాలు పంచుతామన్నారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు చేపట్టాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్ జిల్లా కమిటీ సభ్యులు సతీష్ సుదర్శన్ , గోపాల్ రెడ్డి, రైతు సంఘం నాయకులు kvps sfi DYFI నాయకులు తేజా అజీమ్ ఖాన్ నాసిర్ గాఫ్ఫ్మహార్ అనంతయ్య రాములు రాజు అనసూయ కమిలి బాయ్ శ్యామయ్య కుమార్ అరుణ శ్రీనివాస్ కిష్టప్ప రాజేందర్ శ్రీకాంత్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

MOGULAIAH, VIKARABAD

MOGULAIAH, VIKARABAD

Next Story