Dharur: రుద్రారంలో పిడుగుపాటుకు 15 మేకలు మృతి ఆదుకోవాలని డిమాండ్
Dharur: వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రుద్రారంలో అకాల వర్షానికి పిడుగు పడి 15 మేకలు అక్కడికక్కడే మృతి చెందాయి. బాధితులను ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్.
Dharur: రుద్రారంలో పిడుగుపాటుకు 15 మేకలు మృతి ఆదుకోవాలని డిమాండ్
దారూర్: వికారాబాద్ జిల్లా, దారూర్ మండలం, రుద్రారం గ్రామంలో పిడుగు పడి 15 మేకలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గ్రామ శివారులో మేతకు వెళ్లిన మేకల మందపై ఒక్కసారిగా పిడుగు పడడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో గొర్రెల కాపరి కుటుంబం తీవ్రంగా నష్టపోయింది.
విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story




