Dundigal: అమరవీరుల స్థూపాన్ని మరిచిన అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు
Dundigal: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అమరవీరుల స్థూపాన్ని అధికారులు నిర్లక్ష్యం చేయడంపై ఎమ్మెల్సీ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dundigal: అమరవీరుల స్థూపాన్ని మరిచిన అధికారులపై కలెక్టర్కు ఫిర్యాదు
Dundigal: దుండిగల్ జిహెచ్ఎంసి కార్యాలయంలో అమరవీరుల ఓస్తూపానికి అవమానం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని మరచిన జిహెచ్ఎంసి, రెవెన్యూ అధికారులపై ఎంఎల్ సి శంభీపూర్ రాజు ఆగ్రహం. ఇక్కడి అధికారుల చిత్తశుద్దిపై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎంఎల్ సి శంభీపూర్ రాజు. బిఆర్ఎస్ నాయకుల సహకారంతో అమరవీరుల స్తూపాన్ని నీళ్లతో కడిగి పూలమాలలు వేసి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్న ఎంఎల్ సి శంభీపూర్ రాజు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం అయితే సీరియస్ గా పరిగణిస్తామని హెచ్చరింపు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో లాగా అమరవీరుల స్తూపాలను డెకరేట్ చేసి అమరవీరుల త్యాగాల పోరాటాలను స్మరించి,గుర్తించాలని హితవు. అనంతరం తమ సిబ్బంది తో సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి అక్కడి అధికారుల పనితీరును తెలుసుకున్న ఎంఎల్ సి శంభీపూర్ రాజు.




