Hyderabad: ఈసీఐఎల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ ఎమ్మెల్యే బండారి మద్దతు

Hyderabad: జాబ్ క్యాలెండర్, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదలకై ECILలో విద్యార్థులు భారీ ర్యాలీ చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మద్దతు తెలిపేశారు.

ASHOK, KAPRA
Published on: 5 Sept 2026 5:58 PM IST
Hyderabad
X

Hyderabad: ఈసీఐఎల్‌లో విద్యార్థుల భారీ ర్యాలీ ఎమ్మెల్యే బండారి మద్దతు

హైదరాబాద్: విద్యార్థులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలి అనే ప్రధాన డిమాండ్లతో ఈ ర్యాలీ చేపట్టారు.

ఈసీఐఎల్ లో ని రౌండ్ బిల్డింగ్ వద్ద ప్రారంభమైన ఈ భారీ ర్యాలీ రాధిక X రోడ్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడి ఉన్న సమస్యలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించి వెంటనే పరిష్కరించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించడంతో పాటు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి, యూత్ డిక్లరేషన్‌ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని అన్నారు.విద్యార్థుల హక్కుల కోసం – యువత భవిష్యత్తు కోసం – హామీల అమలు కోసం ఐక్యంగా పోరాడుదాం అంటూ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి కొత్త రామారావు కాసం మైపాల్ రెడ్డి కాసం మైపాల్ రెడ్డి ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన మాజీ, కార్పొరేటర్లు ,విద్యార్థులు, నిరుద్యోగ యువత, యువజన నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు యువ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ASHOK, KAPRA

ASHOK, KAPRA

Next Story