Ibrahimpatnam: నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి రాజీనామా చేయాలి మంత్రి శ్రీధర్ బాబు
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం కేజీబీవీలో ఛాట్రోన్ కి గూంజ్ కార్యక్రమం. నీట్ పేపర్ లీకేజీపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన మంత్రి శ్రీధర్ బాబు.
Ibrahimpatnam: నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి రాజీనామా చేయాలి మంత్రి శ్రీధర్ బాబు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్ గూడాలోని కస్తూర్బ గాంధీ హాస్టల్ లో ఏర్పాటు చేసిన CHHATRON KI GOONJ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి,వాక్బ్ బోర్డ్ చైర్మన్ అజముఖ్తుల్లా హుస్సేని
ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ
* దేశంలో విద్య వ్యవస్థ బంగపడ్డది మంత్రి అన్నారు.
* మే నెలలో నిర్వహించిన నీట్ EXAM లీక్ కావడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు తీవ్ర ఆందోళనకు గురైవుతున్నారని మంత్రి తెలిపారు.
* కేంద్ర ప్రభుత్వం పరిధిలో నిర్వహించే నీట్ లీక్ కావడం వలన విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురై ఆత్మహత్యలు చేసుకున్నారని, వీటికి కారకులైన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలన్నారు
* మొదట నిర్వహించిన నీట్ ఎగ్జాం లీక్ తర్వాత రెండవసారి నిర్వహించిన నీట్ ఎగ్జాం పై విద్యార్థులకు,వారి తల్లిదండ్రులుకు అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
* కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల కాలంలో నిర్వహించిన పరీక్షలలో 152 సార్లు పేపర్లు జరగడం దురదృష్టకరమన్నారు




