LB Nagar: 118 జీవో బాధితులకు శుభవార్త.. నేడు సరూర్నగర్లో మంత్రుల సభ!
LB Nagar: ఎల్బీనగర్ 118 జీవో సమస్య పరిష్కారానికి నేడు సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మంత్రుల ఆధ్వర్యంలో సభ; బాధితులకు హక్కు పత్రాలపై స్పష్టత ఇవ్వనున్నారు.
LB Nagar: 118 జీవో బాధితులకు శుభవార్త.. నేడు సరూర్నగర్లో మంత్రుల సభ!
LB Nagar: ఎల్బీనగర్ నియోజకవర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న 118 జీవో సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. నేడు సరూర్నగర్లో కీలక సభ జరగనుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ సభకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో పాటు సంబంధిత అధికారులు హాజరుకానున్నారు.
118 జీవో బాధితులకు పూర్తి హక్కు పత్రాల మంజూరుకు సంబంధించిన ప్రక్రియపై ఈ సభలో కీలక ప్రకటన చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
118 జీవో సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరించడంతో పాటు.. బాధితులకు హక్కు పత్రాలపై స్పష్టత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా 118 జీవో బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపునిచ్చారు.
📅 తేదీ: సెప్టెంబర్ 19, 2026
⏰ సమయం: మధ్యాహ్నం 3 గంటలకు
📍 వేదిక: సరూర్నగర్ ఇండోర్ స్టేడియం




