Kukatpally: ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన పోలీసులు!
Kukatpally: కూకట్పల్లి కేపీహెచ్బీ పరిధిలోని హైదర్నగర్లో వ్యక్తి అనుమానాస్పద మృతి; ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్తో ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు.
Kukatpally: ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించిన పోలీసులు!
Kukatpally: కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని హైదర్నగర్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శుక్రవారం రాత్రి ఓ అపార్ట్మెంట్కు వచ్చిన వ్యక్తి అక్కడే మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించి ఆధారాలను సేకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, మరణానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.




