Hyderabad: భరతోదయం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు!

Hyderabad: హైదరాబాద్ సత్యసాయి నిగమాగమంలో ఆచార్య డా. దేవరాజు రాంభావు రచించిన 'భరతోదయం' మహాపద్యకావ్యాన్ని రాష్ట్ర ఐటీ మంత్రి డి. శ్రీధర్ బాబు ఘనంగా ఆవిష్కరించారు.

RAJESH,	WEST ZONE
Published on: 12 July 2026 10:28 PM IST
Hyderabad
X

Hyderabad: భరతోదయం ఆవిష్కరణ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు!

హైదరాబాద్: ఆచార్య డా. దేవరాజు రాంభావు రచించిన "భరతోదయం" మహాపద్యకావ్యం ఘనంగా ఆవిష్కరించబడింది. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో నవ్య సాహితీ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై గ్రంథాన్ని ఆవిష్కరించారు.

విజ్ఞాన శాస్త్రం, సాహిత్యాల అపూర్వ కలయికగా ఆచార్య రాంభావు వ్యక్తిత్వాన్ని మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా రచయిత దంపతులను ఘనంగా సత్కరించడంతో పాటు ఆయన రచించిన మరో మూడు పద్య కృతులను కూడా ఆవిష్కరించారు.

కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, విద్యావేత్తలు, కవులు, రచయితలు పాల్గొని రాంభావు సాహిత్య సేవలను ప్రశంసించారు.

RAJESH,	WEST ZONE

RAJESH, WEST ZONE

Next Story