Ponnam Prabhakar: తెలంగాణను అవమానించిన ఆ ఎంపీని బర్తరఫ్ చేయాలి

Ponnam Prabhakar: తెలంగాణ ఏర్పాటును పాక్ విభజనతో పోల్చిన తేజస్వీ సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం. ఎంపీని బర్తరఫ్ చేయాలని స్పీకర్‌కు లేఖ.

Arun Chilukuri
Published on: 16 April 2026 5:10 PM IST
Ponnam Prabhakar
X

Ponnam Prabhakar: తెలంగాణను అవమానించిన ఆ ఎంపీని బర్తరఫ్ చేయాలి

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత-పాక్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచిన సూర్యను ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన తేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్‌కు అధికారికంగా లేఖ రాస్తున్నట్లు వెల్లడించారు. "రాష్ట్రానికి ఇంతటి అవమానం జరుగుతుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరియు ఇతర బీజేపీ నేతలు మౌనంగా ఉండటం బాధాకరం. తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి, ఇక్కడి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడతారా?" అని ప్రశ్నించారు. తెలంగాణ అనేది ఎందరో ఆత్మత్యాగాలు, దశాబ్దాల ప్రజాస్వామిక పోరాటం వల్ల సాధ్యమైందని.. దానిని విద్వేషపూరిత విభజనతో పోల్చడం బీజేపీ అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు.

నాడు ఎందుకు ఇవ్వలేదు?

2001లో మూడు రాష్ట్రాలను (ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్) ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం, తెలంగాణను ఎందుకు అడ్డుకుందని పొన్నం నిలదీశారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గాయపరిచేలా మాట్లాడే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story