Bachupally: సామాజిక సేవలో మేము సైతం అంటూ.. ఖాకీలు

Bachupally: మియాపూర్-గండిమైసమ్మ ప్రధాన రహదారిపై వాన వల్ల నిలిచిన నీటిని తొలగించిన ట్రాఫిక్ పోలీసులు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 10 Jun 2026 8:41 AM IST
Bachupally
X

Bachupally: సామాజిక సేవలో మేము సైతం అంటూ.. ఖాకీలు

బాచుపల్లి: శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణకే పరిమితం కాకుండా, సామాజిక సేవలో కూడా తాము ముందుంటామని మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు నిరూపించుకున్నారు. మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో మియాపూర్ - గండిమైసమ్మ ప్రధాన రహదారిపై పలు చోట్ల నీరు నిలిచిపోయింది. దీనివల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పరిస్థితిని గమనించిన ట్రాఫిక్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ విధులు పక్కనపెట్టి, స్వయంగా రోడ్లపైకి దిగి నీటిని బయటకు పంపే పనుల్లో నిమగ్నమయ్యారు. పోలీసుల ఈ స్పందన చూసి స్థానికులు కూడా వారికి తోడయ్యారు. పోలీసులు తమ విధి నిర్వహణలోనే కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ఎప్పుడూ ముందుంటామని మరోసారి చాటిచెప్పారు. కష్టాల్లో ఉన్నప్పుడు పోలీసులే అండగా నిలవడంతో స్థానికులు వారిని ప్రశంసించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story