Khairatabad: ఓటరు సవరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అవగాహన!

Khairatabad: ఖైరతాబాద్‌లో ఓటరు సవరణ ప్రక్రియ (SIR) అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఫారాలు నింపాలని సూచించారు.

GIRI, CENTRAL ZONE
Published on: 25 Jun 2026 4:09 PM IST
Khairatabad
X

Khairatabad: ఓటరు సవరణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక అవగాహన!

ఖైరతాబాద్‌: ఓటరు సవరణ ప్రక్రియ లో అప్రమత్తంగా లేకపోతే ఓటు తొలగిపోయే అవకాశం ఉందని , బిఎల్ఓ లు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం నింపి ఇవ్వాలని అప్పుడే ఓటు తొలగకుండా ఉంటుందని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్,ఇతర అధికారులు ,ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో నేటి నుండి SIR ప్రక్రియ ప్రారంభించింది. ఈరోజు ఇంటింటికి బిఎల్వో లకు ఎన్యూమరేషన్ ఫారాలు అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల పోలింగ్ స్టేషన్ లలో కాంగ్రెస్ పార్టీ bla లను నియమించింది.

Bla లు blo లతో సమన్వయం చేసుకోవాలి.. ఓటరు సవరణ ప్రక్రియ లో అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగకుండా చూసుకోవాలి. ఎన్నికల కమిషన్ ప్రతి ఇంటికి వెళ్ళి ఓటరు సవరణ చేస్తుంది.. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా తొలగవద్దు. ఇటీవల ఎన్నికలు జరిగిన బెంగాల్ ,తమిళనాడు లో లక్షలాది ఓట్లు తొలగించారు..అలాంటి పరిస్థితి ఇక్కడికి రావద్దు.

2002 ప్రకారం తెలంగాణ లో కోటి ఓటర్లు ఉన్నారు. తెలంగాణ లో గ్రామ స్థాయి ఉన్న కార్యకర్త నుండి పై వరకు ఒక్క ఓటు కూడా తొలగకుండా చూసుకోవాలి. ముఖ్యమంత్రి గారు , పీసీసీ అధ్యక్షుడు ,ఏఐసీసీ నేతలు ఓటరు సవరణ ప్రక్రియ పై ఎప్పటికప్పుడు మా కార్యకర్తలను అప్రమత్తం చేస్తున్నారు..

ఈరోజు నుండి జూలై 24 వరకు సార్ జరుగుతుంది.. జూలై 31 కి డ్రాఫ్ట్ ఓటరు లిస్ట్ వస్తుంది. 2002 పోలింగ్ ఓటరు లిస్ట్..2025 ఓటరు లిస్ట్ పోల్చి చూడాలి. ఓట్లు తొలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

GIRI, CENTRAL ZONE

GIRI, CENTRAL ZONE

Next Story