Quthbullapur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం శంభీపూర్ క్రిష్ణ

Quthbullapur: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం శంభీపూర్‌లో ప్రజలను కలిసిన బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని వెల్లడి.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 7 Aug 2026 5:17 PM IST
Quthbullapur
X

Quthbullapur: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ శంభీపూర్ లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గానికి చెందిన ప్రజలు, కాలనీ సభ్యులు, నాయకులు, అభిమానులు పలువురు మర్యాదపూర్వకంగా కలిశారు వారు సానుకూలంగా స్పందించారు.

ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టి అధ్యక్షులు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కె.పి వివేకానంద దృష్టికి తీసుకెళ్లి వారి సహాయ సహకారాలతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదే విధంగా పలు శుభ కార్యక్రమాలలో, బోనాల ఉత్సవాల్లో పాల్గొనాలని పలువురూ ఆహ్వానించారు.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story