Hyderabad: త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం!

Hyderabad: హైదరాబాద్ లోని సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి మరియు మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ పరిశీలించారు.

MOHD MOHIUDDIN, YAKUTHAPURA
Published on: 5 Aug 2026 1:47 PM IST
Hyderabad
X

Hyderabad: త్వరలో సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ప్రారంభం!

Hyderabad: సైదాబాద్ లో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి ను & ముసారాంబాగ్ బ్రిడ్జి మంత్రి అజారుద్దీన్ తో కలిసి పరిశీలించిన హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, కాలేరు వెంకటేష్,ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,ఇతర ముఖ్య నేతలు, అధికారులు

మంత్రి పొన్నం ప్రభాకర్

చాలా కాలంగా పెండింగ్ లో ఉండి 680 కోట్ల రూపాయలతో పూర్తి చేసుకున్న సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి పనులు చంచల్ గూడా జైలు నుండి ఒవైసీ హాస్పిటల్ వరకు ,చంపాపేట కి మరో లైన్ తో పూర్తి చేసుకుంది.

త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది..

సంతోష్ ,చంచల్ గూడ జైలు ,సైదాబాద్ ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది..

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి తో పాటు మూసారాంబాగ్ బ్రిడ్జి తర్వలోనే ప్రారంభం చేసుకొని ప్రజలకు ఉపయోగంలోకి వస్తుంది

ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ బ్రిడ్జి సౌకర్యం ఉంటుంది..

దీనికి అప్రోచ్ రోడ్డు విస్తరణ చేయాలి.. పెండింగ్ లో ఉన్న ఈ బ్రిడ్జి లను ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు

నగరంలో పెరుగుతున్న జనాభా కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుంది..

కేబీఆర్ పార్క్ వద్ద బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగిస్తున్నాం..

ట్రాఫిక్ ,ప్రజా సేవల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది..

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

MOHD MOHIUDDIN, YAKUTHAPURA

Next Story