Secunderabad: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌కు నిరసన.. కాంగ్రెస్ భారీ ర్యాలీ!

Secunderabad: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ నమోదును నిరసిస్తూ సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ.

Srikanth, Secunderabad
Published on: 2 Sept 2026 1:38 PM IST
Secunderabad
X

Secunderabad: రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌కు నిరసన.. కాంగ్రెస్ భారీ ర్యాలీ!

Secunderabad: రాహుల్ గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసనకు దిగాయి. సికింద్రాబాద్ ఎంజీ రోడ్డు నుంచి బాంబే హోటల్ వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు దీపక్ జాన్ తో పాటు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడుతూ... రాహుల్ గాంధీ పై కేసులు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాటం ఆపదని స్పష్టం చేశారు.

Srikanth, Secunderabad

Srikanth, Secunderabad

Next Story