Shabad: పగడాల రాంరెడ్డి మృతదేహానికి పట్నం అవినాష్ రెడ్డి నివాళి
Shabad: షాబాద్ మండలం గొల్లూరుగూడెంలో గుండెపోటుతో మృతి చెందిన రాంరెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి.
Shabad: పగడాల రాంరెడ్డి మృతదేహానికి పట్నం అవినాష్ రెడ్డి నివాళి
షాబాద్: షాబాద్ మండలంలోని గొల్లూరుగూడెం గ్రామానికి చెందిన పగడాల రాంరెడ్డి సోమవారం గుండెపోటుతో మృతి చెందారు.
రాంరెడ్డి మృతి విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి మంగళవారం ఉదయం గొల్లూరుగూడెం గ్రామానికి వెళ్లారు.
రాంరెడ్డి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుమారులు మధుసూదన్ రెడ్డి, సురేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రాంరెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అవినాష్ రెడ్డి, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేశారు.
Next Story




