Weather Update: తెలంగాణ ప్రజలకు వార్నింగ్.. 47 డిగ్రీలు దాటనున్న ఎండలు!

Weather Update: తెలంగాణలో ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మే 18 నుండి 22 మధ్య ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR
Published on: 12 May 2026 9:59 AM IST
Weather Update
X

Weather Update: తెలంగాణ ప్రజలకు వార్నింగ్.. 47 డిగ్రీలు దాటనున్న ఎండలు!

తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు శరవేగంగా పెరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది._

నిన్న నిజామాబాద్ జిల్లా సాలూరలో అత్యధికంగా 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నేడు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నప్పటికీ, అది వేడి నుంచి పెద్దగా ఉపశమనాన్ని ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

47 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు – అప్రమత్తత అవసరం

ముఖ్యంగా ఈ నెల 18 నుండి 22వ తేదీల మధ్య ఎండలు గరిష్ట స్థాయికి చేరుతాయని, ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల వరకు నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. సుమారు 10 రోజుల పాటు వడగాల్పులు (Loo Winds) తీవ్రంగా వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రభుత్వం సూచించింది.

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

BOMMA SRIDHAR, QUTHBULLAPUR

Next Story