Somajiguda: సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ.. టెన్త్ విద్యార్థులకు అవార్డులు!
Somajiguda: పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు జూన్ 13న వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నారు.
Somajiguda: సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ ఆవిష్కరణ.. టెన్త్ విద్యార్థులకు అవార్డులు!
Somajiguda: పదవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు జూన్ 13న ప్రతిభా పురస్కారాలను అందజేయనున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలిపింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సంఘం గౌరవ అధ్యక్షులు పటోళ్ల సంగమేశ్వర్, రాష్ట్ర అధ్యక్షులు దినేష్ పటేల్, ప్రధాన కార్యదర్శి రాజప్ప లు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 500 కు పైగా మార్కులు సాధించిన కుల విద్యార్థులకు, ప్రవేట్ పాఠశాలలో చదివి 525 పైగా మార్పు సాధించిన విద్యార్థులకు, సీబీఎస్ఈ లో 80 శాతానికి పైగా మార్కులు సాధించిన ఈ పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.




