Vikarabad: అనారోగ్యంతో వికారాబాద్ డీఆర్వో మంగీలాల్ మృతి
Vikarabad: వికారాబాద్ జిల్లా డీఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్న మంగీలాల్ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల రెవెన్యూ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
Vikarabad: అనారోగ్యంతో వికారాబాద్ డీఆర్వో మంగీలాల్ మృతి
వికారాబాద్: వికారాబాద్ జిల్లా DROగా విధులు నిర్వహిస్తున్న మంగీలాల్ అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో సెలవులో ఉన్న ఆయన గురువారం కన్నుమూశారు.
డీఆర్వోగా పనిచేసిన కొద్దికాలంలోనే మంచి పరిపాలనా నైపుణ్యంతో విధులు నిర్వర్తించారని ఉద్యోగులు కొనియాడారు. ప్రజా సేవలో చక్కటి పనితీరు కనబరిచిన అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.
ఆయన మృతి పట్ల ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
Next Story




