Miyapur: దోమల నివారణపై మియాపూర్లో జీహెచ్ఎంసీ అవగాహన సదస్సు!
Miyapur: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా జీహెచ్ఎంసీ మియాపూర్ సర్కిల్-48లో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Miyapur: దోమల నివారణపై మియాపూర్లో జీహెచ్ఎంసీ అవగాహన సదస్సు!
మియాపూర్: మియాపూర్ సర్కిల్-48: ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం రోజున మియాపూర్ సర్కిల్-48 పరిధిలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. దోమల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ (DC), అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (AMOH) తో పాటు ఎంటమాలజీ విభాగ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల ముందు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Next Story




