Indian Embassy: ఇరాన్కు వెళ్తున్నారా?.. భారత పౌరులకు ఎంబసీ కీలక హెచ్చరిక!
Indian Embassy: అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధ ముగింపు ప్రకటన వచ్చినప్పటికీ పశ్చిమాసియాలో ఇంకా గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Indian Embassy: ఇరాన్కు వెళ్తున్నారా?.. భారత పౌరులకు ఎంబసీ కీలక హెచ్చరిక!
Indian Embassy: అమెరికా-ఇరాన్ల మధ్య యుద్ధం ముగింపునకు సంబంధించి ఒప్పందాలు జరిగినప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే చల్లారుతున్న నేపథ్యంలో, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) తమ పాత ప్రయాణ మార్గదర్శకాలను (Travel Advisory) సవరించింది. ఇరాన్లో పరిస్థితులు కాస్త మెరుగుపడినట్లు కనిపిస్తున్నా, ప్రస్తుతానికి ఆ దేశానికి అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత పౌరులకు సూచించింది. ఈ మేరకు ఎంబసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది.
ఎంబసీ జారీ చేసిన కీలక మార్గదర్శకాలు:
ఇరాన్లోని భద్రతా పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి సాнуకూల మార్పులు కనిపిస్తున్నా.. ఇరాన్లో ఉంటున్న భారతీయులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు, అక్కడి స్థానిక అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను కచ్చితంగా పాటించాలి. తదుపరి నోటీసులు ఇచ్చేంతవరకు ఇరాన్కు అనవసరమైన లేదా అత్యవసరం కాని ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. అనివార్య కారణాల వల్ల ఇరాన్కు రావాల్సి వస్తే.. ముందే భారత ఎంబసీ అధికారులను సంప్రదించి తమ వివరాలను తప్పనిసరిగా నమోదు (Register) చేసుకోవాలి. తాజా అప్డేట్ల కోసం ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్సైట్ను ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి.
అమెరికా-ఇరాన్ల మధ్య శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగినప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొన్ని కీలక అంశాలపై రెండు దేశాల మధ్య ఇంకా భేదాభిప్రాయాలు నడుస్తూనే ఉన్నాయి. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ అణు కేంద్రాలను తనిఖీ చేయడానికి అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) ఇన్స్పెక్టర్లను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రకటనను ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
మరోవైపు, అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' (Strait of Hormuz) విషయంలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. హర్మూజ్ను తాము మూసివేశామని టెహ్రాన్ చెప్తుండగా, అది తెరిచే ఉందంటూ అమెరికా వాదిస్తోంది. ఈ భిన్న ప్రకటనల వల్ల పశ్చిమాసియాలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తెలియని అనిశ్చితి నెలకొంది. అందుకే భారత పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎంబసీ ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది.




