Helicopter Crash: అడవిలో కూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది దుర్మరణం!
Helicopter Crash: ఇండోనేసియాలో కూలిన హెలికాప్టర్. ఎనిమిది మంది ప్రయాణికులు మృతి. పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్లో విషాదం. ప్రమాద కారణాలపై దర్యాప్తు.
Helicopter Crash: అడవిలో కూలిన హెలికాప్టర్.. ఎనిమిది మంది దుర్మరణం!
Helicopter Crash: ఇండోనేసియాలో భారీ హెలికాప్టర్ ప్రమాదం సంభవించింది. పశ్చిమ కాళీమంతన్ ప్రావిన్స్లో జరిగిన ఈ ఘటనలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు విమాన సిబ్బంది కాగా, ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు.
మాథ్యూ ఎయిర్ నుసంతారాకు చెందిన 'ఎయిర్ బస్ హెచ్-130' అనే హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. గురువారం మెల్వాయ్ ప్రాంతంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తో సంబంధాలు తెగిపోయాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో సిగ్నల్స్ అందలేదు. గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ బృందాలు, టేకాఫ్ పాయింట్ నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కొండపై హెలికాప్టర్ తోక భాగాన్ని గుర్తించాయి. హెలికాప్టర్ కుప్పకూలిన వేగానికి అందులో ఉన్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు నిర్ధారించారు.
కారణాలు తెలియాల్సి ఉంది..
ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఒక పామాయిల్ కంపెనీకి చెందినదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం సైనిక, పోలీసు మరియు సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు లేదా సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.




