Vijayawada: మట్టి ఖర్చులకూ దిక్కులేదు.. బీమా పునరుద్ధరించండి!
Vijayawada: రాష్ట్రంలో 'చంద్రన్న బీమా' పథకాన్ని తక్షణమే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి విజ్ఞప్తి.
Vijayawada: మట్టి ఖర్చులకూ దిక్కులేదు.. బీమా పునరుద్ధరించండి!
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చంద్రన్న బీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని ఏపీ లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి కోరారు బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి రాసిన లేఖను విధుల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన సుదీర్ఘ రాజకీయ చరిత్రలోనే ప్రవేశపెట్టిన సంక్షేమ పథకంలో చంద్రన్న బీమా గొప్పదని 2017 నుండి 2019 వరకూ రాష్ట్రంలో సుమారు 5 లక్షల కుటుంబాలకు పైగా ప్రభుత్వం నుండి అత్యవసర ఆర్ధిక సహాయం అందిందని 2017 అక్టోబరు 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించిన ఈ పథకంలో వైట్ కార్డు హోల్డర్ కుటుంబాల్లో ఉన్న 18 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉన్నవారు సాధారణంగా మరణిస్తే 2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే 5 లక్షలు, ప్రమాదంలో పాక్షిక అంగవైకల్యం చెందితే 2.50 లక్షలు, పూర్తి అంగవైకల్యం చెందితే 5 లక్షలు, 51 నుండి 60 సంవత్సరాల వయసు వారు సాధారణంగా మరణిస్తే 30 వేలు ప్రమాద బీమా, 61 నుండి 70 సంవత్సరాల వయస్సు వారు సాధారణంగా మరణిస్తే ఏమి ఇవ్వనప్పటికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించారని కుటుంబాల్లో ఎవరు చనిపోయినా వెంటనే మట్టి ఖర్చులు అందించేవారని గత ప్రభుత్వం ఈ పథకాన్ని అనేక తగ్గింపులతో ఆంక్షలతో యూనివర్సల్ సంపూ ఇన్సూరెన్స్ కంపెనీతో గొడవలు పరిష్కరించలేక పథకాన్ని పక్కన పడేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందినవారు పాముకాటు తోగాని ప్రమాదంలోగాని పిడుగుపాటుతో గాని దురదృష్టవశాత్తు చనిపోతే మట్టికర్చులకు డబ్బులు లేక లక్షలాది కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా చంద్రన్న బీమా వంటి గొప్ప సహాయం పేదలకు మరేమీ ఉండదని వెంటనే పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని భీశెట్టి కోరారు ఈ సమావేశంలో లోక్ సత్తా నాయకులు బొర్రా శ్రీను,బావిశెట్టి సతీష్,తుమ్మల కృష్ణారావు, స్వామి తదితరులు పాల్గొన్నారు.


