Srikakulam: బయటకి వస్తే జాగ్రత్త! సోంపేటలో ర్యాలీలు, సభలపై ఆంక్షలు!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా సోంపేట సర్కిల్ పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులోకి వచ్చింది. ర్యాలీలు, ధర్నాలు, సభలపై నిషేధం విధిస్తూ సీఐ మంగరాజు ఆదేశాలు జారీ చేశారు.
Srikakulam: బయటకి వస్తే జాగ్రత్త! సోంపేటలో ర్యాలీలు, సభలపై ఆంక్షలు!
Srikakulam: సోంపేట సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున సోంపేట పోలీస్ సర్కిల్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు నిరసన కార్యక్రమాలపై నిషేధం ఉన్నట్లు సోంపేట సీఐ బి. మంగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. డీఎస్పీ కార్యాలయం ఉత్తర్వుల మేరకు ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలకు అనుమతి లేదన్నారు. ప్రజలు గుంపులుగా చేరరాదని తెలిపారు. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా ఒకచోట చేరడం చేరడం చట్టరీత్యా నిషేధం.
నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story




