Vikarabad: తాండూరులో ఖర్గేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

Vikarabad: బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను విష సర్పాలతో పోల్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వ్యాఖ్యలపై తాండూరులో బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 2:15 PM IST
Vikarabad
X

Vikarabad: తాండూరులో ఖర్గేపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బీజేపీ నేతలు

వికారాబాద్ జిల్లా తాండూరు: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ తాండూరు బిజెపి నేతలు అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లను విష సర్పాలు అని చేసిన వ్యాఖ్యల పై తాండూరు బిజెపి నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని పట్టణ సిఐ కి అందజేశారు..

అనంతరం బీజేపీ ఫ్లోర్ లీడర్ మల్లేశం మాట్లాడుతూ..

జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విష సర్పాలు అని చేసిన వ్యాఖ్యలు అత్యంత అసభ్యకరమని, కాంగ్రెస్ అధ్యక్షుడు తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై ఖర్గే క్షమాపణ చెప్పాలని, ఖర్గే పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story