LakkiReddyPalli: కుర్నూతల అగ్రహారంలో ఎన్‌డీపీఎస్ చట్టంపై సీఐ హెచ్చరిక!

LakkiReddyPalli: లక్కిరెడ్డిపల్లి పరిధిలోని కుర్నూతల అగ్రహారంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు 'పల్లె బాటలో ఈగల్' యాంటీ డ్రగ్స్ సదస్సు నిర్వహించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 July 2026 11:45 PM IST
LakkiReddyPalli
X

LakkiReddyPalli: కుర్నూతల అగ్రహారంలో ఎన్‌డీపీఎస్ చట్టంపై సీఐ హెచ్చరిక!

లక్కిరెడ్డిపల్లి: సమాజాన్ని పట్టిపీడిస్తున్న మత్తు పదార్థాల మహమ్మారిని సమూలంగా పారద్రోలడమే లక్ష్యంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్నూతల అగ్రహారం గ్రామంలో బుధవారం "పల్లె బాటలో ఈగల్" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన సీఐ శ్రీ కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ శ్రీమతి శోభా గారు గ్రామస్తులతో మమేకమై పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలై భవిష్యత్తును ఎలా నాశనం చేసుకుంటున్నారో వివరించిన వారు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగానికి పాల్పడితే ఎన్.డి.పి.ఎస్ చట్టం కింద ఎదుర్కోవాల్సిన కఠిన శిక్షల గురించి హెచ్చరించారు.

గ్రామాల్లో ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు, వాడకం జరిగితే వెంటనే యాంటీ డ్రగ్స్ 'ఈగల్' టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. దీనికి తోడు మహిళలు, చిన్నారుల భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రతా నియమాలు మరియు నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల ఆవశ్యకతను సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఈగల్ సెల్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story