Annamayya: అన్నమయ్య జిల్లాలో ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్లు!

Annamayya: అన్నమయ్య జిల్లా రొంపిచర్ల మార్గంలో ఎర్రచందనం స్మగ్లర్ల బీభత్సం. అటవీశాఖ వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్లు, ఇద్దరు ఫారెస్ట్ అధికారులకు తీవ్ర గాయాలు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 13 Sept 2026 1:54 PM IST
Annamayya
X

Annamayya: అన్నమయ్య జిల్లాలో ఫారెస్ట్ వాహనాన్ని ఢీకొట్టిన స్మగ్లర్లు!

Annamayya: న్నమయ్య జిల్లా రొంపిచెర్ల -పులిచర్ల మార్గ మధ్యలో ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఎర్రచందనం వాహనాన్ని అడ్డుకునే ఉద్దేశంతో రోడ్డుకు అడ్డంగా ఫారెస్ట్ వాహనాన్ని ఆపిఉండగా రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగ్లర్లు. ఎర్రచందనం స్మగ్లర్లు మాత్రం ఏమాత్రం భయపడకుండా అటవీశాఖ అధికారుల వాహనాన్ని ఢీకొట్టి మరీ ముందుకు పారిపోయే ప్రయత్నం చేసారు.

ప్రమాదంలో పీలేరు ఫారెస్ట్ బీట్ అధికారులు ప్రకాష్, చరణ్ ప్రతాప్‌తో పాటు ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లకు తీవ్ర గాయాలయ్యాయి.

తిరుపతిలో చికిత్స పొందుతున్న ఫారెస్ట్ అధికారులు స్మగ్లర్లు. ఎర్రచందనం వాహనాన్ని పక్కా సమాచారంతో పట్టుకోవాలని చూసిన అటవీశాఖ అధికారులు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI