Badvel: కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు నేతలు
Badvel: మున్సిపాలిటీ 22వ వార్డుకు చెందిన 40 కుటుంబాలు టీడీపీ ఇన్-చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి.
Badvel: కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన పలువురు నేతలు
బద్వేల్: బద్వేల్ నియోజకవర్గం, బద్వేల్ మున్సిపాలిటీ 22 వార్డ్ కి చెందిన 40 కుటుంబాలు *బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరియు ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ శ్రీ మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంచూరు సూర్యనారాయణ రెడ్డి గారు వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానిస్తూ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంపై విశ్వాసంతో అన్ని వర్గాల ప్రజలు టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ, గ్రామాభివృద్ధికి కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శివా చారి, కుమారి, సుబ్బాచారి, అనూష, పరిపూర్ణ చారి, మౌనిక, రమణ చారి, భవాని, కృష్ణమాచారి, మమత, విశ్వరూపచారి, లక్ష్మి దేవి, శంకరచారి, నారాయణమ్మ, శివనగచారి, లక్ష్మి, గురమ్మ, మల్లయ్య, సుబ్బారావుడు, చిన్న మల్లయ్య, రమేష్, పాల్గొన్నారు.




