Rayachoty: రాజకీయా పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్ తనిఖీ!

Rayachoty: రాయచోటి మార్కెట్ యార్డ్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 25 Aug 2026 5:53 PM IST
Rayachoty
X

Rayachoty: రాజకీయా పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోడౌన్ తనిఖీ!

Rayachoty: ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా.... మంగళవారం ఉదయం రాయచోటి పట్టణం మార్కెట్ యార్డ్ లో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బియులు, సియూలు, వివి ప్యాట్ లను, అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డిఓ ఏ. శ్రీనివాస్, ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

Next Story