Duvvuru: రహదారి ప్రమాదాల నివారణకు దువ్వూరు పోలీసుల రేడియం స్టిక్కరింగ్!

Duvvuru: దువ్వూరు నేషనల్ హైవేపై రాత్రివేళ ప్రమాదాల నివారణకు ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అతికించిన పోలీసులు. ఎస్ఐ J. ధనుంజయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్.

A. VEERA BHUPAL, MYDUKUR
Published on: 21 July 2026 6:35 AM IST
Duvvuru
X

Duvvuru: రహదారి ప్రమాదాల నివారణకు దువ్వూరు పోలీసుల రేడియం స్టిక్కరింగ్!

Duvvuru: దువ్వూరు మండల పరిధిలోని నేషనల్ హైవేపై రాత్రి సమయంలో వరుసగా జరుగుతున్న రహదారి ప్రమాదాలను అరికట్టేందుకు దువ్వూరు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. దువ్వూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీ J. ధనుంజయుడు గారి ఆధ్వర్యంలో నేషనల్ హైవే (NH) అధికారుల సహకారంతో ట్రాక్టర్లకు ప్రత్యేకంగా రేడియం స్టిక్కరింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

​గ్రామీణ ప్రాంతాల నుంచి రాత్రివేళల్లో పంట ధాన్యం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులతో నేషనల్ హైవేపై వెళ్లే ట్రాక్టర్లకు సరైన వెలుతురు (లైటింగ్) లేదా సూచికలు లేకపోవడం వల్ల వెనుక నుంచి వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్ఐ తెలిపారు.

​​ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు నేషనల్ హైవేపై రాకపోకలు సాగిస్తున్న పలు ట్రాక్టర్లను నిలిపి, వాటికి ముందు మరియు వెనుక భాగాల్లో చీకటిలో మెరిసే రేడియం స్టిక్కర్లను అతికించారు.

​ఈ సందర్భంగా ఎస్ఐ J. ధనుంజయుడు మాట్లాడుతూ

​"రాత్రివేళల్లో మరియు పొగమంచు సమయంలో వాహనదారులకు ముందు వెళ్తున్న ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రేడియం స్టిక్కర్ల వల్ల ఎదురుగా, వెనుక నుంచి వచ్చే వాహనాల వెలుతురు వీటిపై పడగానే మెరుస్తూ దూరంగా ఉన్నప్పుడే స్పష్టంగా కనిపిస్తాయి. దీనితో ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయి."

​ప్రతి ఒక్క రైతు, ట్రాక్టర్ డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను తప్పక పాటించాలని, రాత్రి ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు విజ్ఞప్తి చేశారు. ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానిక ప్రజలు, వాహనదారులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు.

A. VEERA BHUPAL, MYDUKUR

A. VEERA BHUPAL, MYDUKUR

Next Story