Kadapa: దస్తగిరి హత్యకేసు.. నిత్యానంద రెడ్డికి సంబంధం లేదని భార్య

Kadapa: కడపలో దస్తగిరి హత్యకేసుపై డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి భార్య దీప్తి స్పందన. ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.

C.SATHYAMAYYA, KADAPA
Published on: 21 April 2026 12:42 PM IST
Kadapa
X

Kadapa

Kadapa: కడప నగరంలో పెద్ద దస్తగిరి హత్యకేసుకు సంబంధించి డిప్యూటీ మేయర్ బండి నిత్యానంద రెడ్డి పేరును అనుసంధానిస్తూ వస్తున్న ఆరోపణలపై ఆయన భార్య దీప్తి స్పందించారు. అంగడి వీధిలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన భర్తపై వస్తున్న ఆరోపణలు కేవలం నిరాధారమైనవేనని తెలిపారు. పెద్ద దస్తగిరితో తమకు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఈ హత్యకేసుతో తమకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా తమపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. తన భర్త కష్టపడి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎదిగారని, అక్రమ ఆస్తులు లేదా సంబంధిత డాక్యుమెంట్లలో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

ఈ కేసును రాజకీయ కోణంలో కాకుండా సాధారణ కేసుగా విచారణ జరపాలని పోలీసులను కోరారు. కేసును విచారిస్తున్న అధికారిపై తమకు నమ్మకం లేదని తెలిపారు.

తన భర్త ప్రస్తుతం ఇంటికి రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తూ, ఎక్కడ ఉన్నా తిరిగి వచ్చి చట్టపరంగా పోలీసుల ఎదుట హాజరవుతామని ఆమె చెప్పారు.

ఈ సమావేశానికి మాజీ మేయర్ సురేష్ (అప్సర), కార్పొరేటర్లు నిరంజన్ రెడ్డి, దేవి రెడ్డి ఆదిత్య తదితరులు హాజరయ్యారు.

C.SATHYAMAYYA, KADAPA

C.SATHYAMAYYA, KADAPA

Next Story